Friday, April 26, 2024
Friday, April 26, 2024

కేఏ పాల్‌ హౌజ్‌ అరెస్ట్‌

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.తనపై జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేసేందుకు డీసీపీ కార్యాలయానికి వెళ్లాలని పాల్‌ భావించారు. ఈ నేపథ్యంలో కేఏ పాల్‌ను గృహ నిర్బంధం చేశారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేశారు. వడగండ్ల వానకు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లాకు బయలుదేరారు. సిరిసిల్ల వెళ్తున్న పాల్‌ను సిద్దిపేట సరిహద్దులో టీఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకున్నాయి.కేఏ పాల్‌ కారు దిగి టీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో మాట్లాడుతుండగా అక్కడే ఉన్న టీఆర్‌ఎస్‌ కార్యకర్త ఆయనపై దాడి చేశారు. దీంతో ఆయన అనుచరులు నిరసనకు దిగారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరువర్గాలను కట్టడి చేసేందుకు ప్రయత్నించారు.పాల్‌ను సిరిసిల్ల జిల్లాకు రాకుండా పోలీసులు హైదరాబాద్‌కు వెనక్కి పంపారు. పాల్‌పై చేయిచేసుకున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img