Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు : సీఎం కేసీఆర్‌

నేడు రంజాన్‌ (ఈద్‌-ఉల్‌-ఫితర్‌) పర్వదినం సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం సాయంత్రం నెలవంక దర్శనమివ్వడంతో ముస్లిం మతపెద్దలు రంజాన్‌ మంగళవారం జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ స్పందిస్తూ, రంజాన్‌ ఒక పవిత్రమైన పండుగ అని, మానవ సేవ చేయాలన్న సందేశాన్ని మానవాళికి అందించే పండుగ అని తెలిపారు. రంజాన్‌ మాసంలో ఆచరించే ప్రార్థనలు, ఉపవాసం క్రమశిక్షణను, ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈద్‌-ఉల్‌-ఫితర్‌ సందర్భంగా ముస్లింలు తమ పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని అభిలషించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img