Friday, April 26, 2024
Friday, April 26, 2024

కేసీఆర్‌ మెడలు వంచే వరకు దీక్షలు కొనసాగుతాయి : షర్మిల


రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. ఇంకా ఎంతమంది చనిపోతే కేసీఆర్‌ స్పందిస్తారని వైఎస్సార్‌ టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. పది వారాలుగా తాను నిరాహార దీక్షలు చేస్తున్న ప్రభుత్వం స్పందన లేదన్నారు. మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్షలో భాగంగా షర్మిల హనుమకొండ వచ్చారు. కేయూ జంక్షన్‌లో జయశంకర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ, నిరుద్యోగి బోడ సునీల్‌ కుటుంబాన్ని ప్రభుత్వం ఇప్పటికీ ఆదుకోలేదని విమర్శించారు. పది వారాలుగా తాను నిరాహార దీక్షలు చేస్తున్న ప్రభుత్వం స్పందన లేదన్నారు. కేసీఆర్‌ మెడలు వంచే వరకు తన దీక్షలు కొనసాగుతాయని షర్మిల స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img