Friday, April 26, 2024
Friday, April 26, 2024

గ్రామ పంచాయతీల అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి : మంత్రి ఎర్రబెల్లి

సీఎం కేసీఆర్‌ గ్రామ పంచాయతీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని, పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. అందువల్లే మన పల్లెలు దేశానికి పట్టుగొమ్మలుగా మారాయని ఆయన పేర్కొన్నారు. జాతీయ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ పంచాయత్‌ స్వ శక్తి కరణ్‌ పురస్కారానికి ఇటీవల ఎంపికైన మహబూబాబాద్‌ జిల్లా తొర్రూర్‌ మండలం వెంకటాపురం గ్రామ పంచాయతీ, గ్రామ సర్పంచ్‌ను శుక్రవారం మంత్రి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పల్లెలు ప్రగతి బాటలో పయనిస్తేనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని, అందువల్లే మన పల్లెలు దేశానికి పట్టుగొమ్మలుగా మారాయని చెప్పారు. ఈ మధ్య ప్రకటించిన జాతీయ ఉత్తమ జిల్లా, మండల, గ్రామ స్థాయిలో 19 అవార్డులు దక్కాయి. అవన్నీ మన గ్రామాలు దేశానికి ఆదర్శంగా మారాయి అనడానికి నిదర్శనం అన్నారు. సీఎం లక్ష్యాన్ని నెరవేర్చేందుకు మంత్రిగా తాను, అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఇదంతా సాధ్యమైందని మంత్రి చెప్పారు. కరోనా కాలంలో సర్పంచ్‌ సేవను గుర్తు చేశారు. కరోనాతో మరణించిన వ్యక్తిని స్వయం గా ట్రాక్టర్‌ పై తీసుకెళ్లి అంతక్రియలు చేశారు అని గుర్తు చేశారు. ఈ ప్రగతిని కొనసాగిస్తూ మరిన్ని అవార్డులు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. సర్పంచ్‌ లింగన్న గౌడ్‌ ను అభినందించి, తన సహకారం ఎల్లపుడూ ఉంటుందని మంత్రి వెన్నుతట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img