Friday, April 26, 2024
Friday, April 26, 2024

జగ్జీవన్‌రామ్‌ స్ఫూర్తితో దళిత బంధు : సీఎం కేసీఆర్‌

భారత మాజీ ఉప ప్రధాని, కుల రహిత సమాజం కోసం తన జీవితాంతం కృషి చేసిన బడుగు బలహీన వర్గాల నేత, డా. బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతిని పురస్కరించుకుని, ఆయన దేశానికి చేసిన సేవలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం బాబుజీ కి నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్య్రం కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత బాబూ జగ్జీవన్‌ రామ్‌ అని సీఎం అన్నారు. తర తరాలుగా సామాజిక ఆర్థిక వివక్షకు గురౌతున్న దళిత సమాజాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతున్నదని సీఎం తెలిపారు. బాబు జగ్జీవన్‌ రామ్‌ వంటి మహనీయుల ఆశయాల సాధన దిశగా దళిత బంధు వంటి పథకాలను అమలు చేస్తున్నదన్నారు. తద్వారా సామాజిక ఆర్థిక రంగాల్లో దళితుల ఆత్మగౌరవాన్ని అత్యున్నతంగా నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img