Friday, April 26, 2024
Friday, April 26, 2024

జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు పెరుగుతున్న వరద

జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు క్రమంగా వరద పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టులోకి ఎగువ నుంచి జూరాలకు 88,300 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో 12 గేట్లు ఎత్తి 84,739 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 317.740 మీటర్ల వద్ద నీరు ఉన్నది. ఇక శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,27,417 క్యూసెక్కులన నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 62,076 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 884.10 అడుగుల నీటిమట్టం ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img