ఉత్తర కోస్తాంధ్ర- దక్షిణ ఒడిశాలను ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం, ఆదివారం ఆదిలాబాద్, కోమరంభీం, అసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. అప్రమత్తంగా ఉండాలంటూ ఐఎండీ హెచ్చరించింది. ఆరేంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ సహా మిగతా 26 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లా అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.