Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

విజయ గర్జన సభకు స్థలాన్ని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

నవంబర్‌ 15 న వరంగల్‌ లో నిర్వహించనున్న తెలంగాణ విజయ గర్జన సభకు ఏర్పాట్లకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ మేరకు ఎమ్మెల్యేలు అరూరి రమేశ్‌, నన్నపనేని రమేశ్‌ లతో కలిసి పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వరంగల్‌ మామునూరు లోని స్థలాన్ని శనివారం పరిశీలించారు. సభాస్థలి, పార్కింగ్‌ స్థలం, హాజరయ్యే కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు సరిపోయే విధంగా ఉంటుందా? అనే విషయాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.ఇతరత్రా ఇంకా ఏమైనా స్థలాలు ఉన్నాయా? అనే విషయాన్ని కూడా మంత్రి పరిశీలిస్తున్నారు.ఆనాటి సభకు సీఎం, పార్టీ అధ్యక్షుడు కెసీఆర్‌ హాజరై మాట్లాడతారని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించి 20 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రజలనుద్దేశించి ఇన్నేళ్లలో పార్టీ సాధించిన విజయాలను, ప్రభుత్వం సాధించిన ప్రగతిని నివేదిస్తారని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img