Friday, April 26, 2024
Friday, April 26, 2024

తెలంగాణలో రేపటి నుంచి ఒంటిపూట బడులు

వేసవికాలం వచ్చేసింది. రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచే (మార్చి 15) ఒంటిపూట బడులు ప్రారంభించనున్నట్లుగా తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ సంచాలకురాలు శ్రీ దేవ సేన సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఒంటిపూట బడుల టైమింగ్స్‌ విషయానికి వస్తే.. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు పనిచేయనున్నాయి. కరోనా వల్ల ప్రత్యక్ష తరగతులు కొంత ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతి పండుగ సమయంలో కరోనా తీవ్రతరం కావడంతో 24 రోజులు సెలవులు ఇచ్చారు. తరగతులు తక్కువగా నిర్వహించడంతో ఈ ఏడాది 70 శాతం సిలబస్‌ విధానాన్ని అమలుచేస్తున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని రేపటి నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img