తెలంగాణ భవన్లో జరుగుతున్న టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పలు కీలక విషయాలపై కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు.వ్యవసాయ ఉత్పత్తులకు రాజ్యాంగ రక్షణ అవసరం అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు ఉద్యమం చేయాలని, రైతులను కాపాడుకునేందుకు బీజేపీపై తీవ్ర స్థాయిలో పోరాడాలని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తుందని అన్నారు.