Friday, April 26, 2024
Friday, April 26, 2024

నిజంగా సమస్యలు లేకుంటే నా ముక్కు నేలకు రాస్తా : షర్మిల

కేసీఆర్‌ కుటుంబ పాలన అంతానికే ఈ పాదయాత్ర చేస్తున్నానని వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. పాదయాత్ర ప్రారంభం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ వైఎస్సార్‌ చేసిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఒక చరిత్ర అని తెలిపారు. ప్రతి పల్లెకు వస్తా.. వారితో మమేకం అవుతానని అన్నారు. వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. కళ్లముందు 1.90లక్షల ఉద్యోగాలు కనిపించినా నోటిఫికేషన్లు రావు. నిరుద్యోగులు హమాలీలుగా మారారు. ఏడేళ్లలో 30 వేల ఉద్యోగాలు పీకేశారని అన్నారు. కేసీఆర్‌ బీసీలకు ఏం చేశారో చెప్పాలన్నారు. నిజంగా సమస్యలు లేకుంటే నా ముక్కు నేలకు రాస్తా. సమస్యలుంటే రాజీనామా చేసి దళితుడిని సీఎం చేయాలని డిమాండు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img