Friday, April 26, 2024
Friday, April 26, 2024

పబ్‌లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

తాగి వాహనం నడిపితే పబ్‌ నిర్వాహకులదే బాధ్యత అని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం విధించిన ఆంక్షలను జనవరి 4వ తేదీ ఉదయం వరకూ అమలుచేయాలని పోలీసులను ఆదేశించింది. శబ్ద కాలుష్యం 45 డేసిబుల్స్‌కి మించరాదని సూచించింది. ఎక్సైజ్‌ శాఖను కూడా ప్రతివాదులుగా చేర్చాలని హైకోర్టు పేర్కొంది.కొత్త సంవత్సర వేడుకలపై సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌, హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని ఆదేశించింది. వేడుకలు ముగిసిన తరువాత జరిగిన పరిణామాలు, పోలీసుల నివేదిక ఆధారంగా ఆదేశాలు ఇస్తామని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను జనవరి 6కి హైకోర్టు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img