28న నందికొండ నుంచి శ్రీశైలంకు లాంచీ ట్రిప్పు ప్రారంభం
నందికొండ నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణం కొనసాగించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లును పూర్తి చేసింది. ఈ నెల 28వ తేదీన హిల్కాలనీ లాంచీ స్టేషన్ నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణాలు ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్ రిజర్వా యర్లో నీటి మట్టం 575 అడుగులకు పైన ఉన్నందున లాంచీ ప్రయాణం కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రతి వారంతపు శనివారం ఉదయం ప్రారంభమయ్యే ఈ లాంచీ ప్రయాణం ఆదివారం సాయంత్రం తిరిగి నాగార్జునసాగర్కు చేరుకుంటుంది. ఈ రెండు రోజుల ప్రయాణంలో పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా టూరిజం శాఖ లైఫ్ జాకెట్లు, మంచినీటి వసతి, ఆహార ఏర్పాట్లతో పాటు అన్ని రకాల జాగ్రత్తలను తీసుకుంటుంది. లాంచీ ప్రయాణానికి సంబంధించిన వివరాలు, టికెట్ ధరలను అన్లైన్లో పొందవచ్చునని తెలి పారు. పర్యాటకుల కోసం హిల్కాలనీ లాంచీ స్టేషన్ ఫొన్ నం 7997951023 అందుబాటులో ఉంచారు.