పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం పలు పాఠశాలలను, అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. పాఠశాలలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా పంచాయతీ సిబ్బందికి ఆదేశాలిచ్చినట్లు తెలిపారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సమన్వయంతో పనిచేయాలన్నారు.