ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిభవన్ ముట్టడికి నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు.ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదని నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో ప్రగతిభవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు గోషామహాల్ పీఎస్కు తరలించారు.