Friday, April 26, 2024
Friday, April 26, 2024

బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులకు మంత్రి కేటీఆర్‌ భరోసా

బాసరలో ఉన్న రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) విద్యార్థులు చేస్తున్న నిరసనలకు మంత్రి కేటీఆర్‌ స్పందించారు. వారి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో విద్యారంగంలో సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ట్విటర్‌ ద్వారా వెల్లడిరచారు. విద్యార్థుల లేవనెత్తిన సమస్యలను సీఎం కేసీఆర్‌, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.విశ్వవిద్యాలయంలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కారని తేజాగౌడ్‌ అనే విద్యార్థి మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img