Friday, April 26, 2024
Friday, April 26, 2024

మరింత గొప్ప దేశంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలి

కేటీఆర్‌ ట్వీట్‌

స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల వేళ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా భారతీయులందరికీ ఇవాళ ఒక మైలురాయి రోజు అని పేర్కొన్నారు. ఈ ప్రపంచంలో మన దేశానికి ఉన్న విశిష్టతను మనం గౌరవించుకుందాం అని పిలుపునిచ్చారు. మనల్ని ఏకం చేసే అంశాలపై దృష్టి పెడుదాం.. మనల్ని విభజించి చూసే అంశాలపై దృష్టి పెట్టొద్దు. ప్రేమను, సంతోషాన్ని పంచండి.. ఈ దేశాన్ని మరింత గొప్ప దేశంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయండి అని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img