వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మెట్పల్లి రైతులతో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,మెట్పల్లికి సాగునీరు తీసుకువస్తాం. వచ్చే పంట కాలానికి అందుబాటులో సాగునీరు అందిస్తామని అన్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత గ్రామానికి వస్తా. గ్రామం అంతా పర్యటించి సాగునీరు ఎలా తీసుకురావాలో అందరం కలిసి పరిశీలిద్దామన్నారు. ప్రత్యేకంగా పైపులైన్ నిర్మాణం చేసి మెట్పల్లికి సాగునీరు అందిస్తామన్నారు.