Friday, April 26, 2024
Friday, April 26, 2024

రాష్ట్రంలో తెరుచుకున్న విద్యాసంస్థలు

కరోనా థర్డ్‌వేవ్‌ నేపథ్యంలో మూతపడిన విద్యాసంస్థలు నేటి నుంచి తెరుచుకున్నాయి. సంక్రాంతి సందర్భంగా జనవరి 8న విద్యాసంస్థలు మూతపడ్డాయి. అయితే కరోనా తీవ్రత నేపథ్యంలో సెలవులను జనవరి 31 వరకు పొడిగించారు. ఇన్ని రోజుల సెలవుల అనంతరం పాఠశాలలను పున:ప్రారంభించారు. కొవిడ్‌ నిబంధనలను అధికారులు కఠినంగా అమలుచేస్తున్నారు. అయితే, సీబీఎస్‌ఈ పాఠశాలలు మాత్రం ఈనెల 2 నుంచి ప్రారంభిస్తామని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాయి. మరికొన్ని పాఠశాలలు కొన్ని రోజుల పాటు ఆన్‌ లైన్‌ తరగతులను కొనసాగించాలని నిర్ణయించాయి. మరోవైపు క్లాసులను నిర్వహించే క్రమంలో విద్యాసంస్థల యాజమాన్యాలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img