మంత్రి కేటీఆర్
ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహం నగరంలోని మాదాపూర్లో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన నేతలు, మంత్రి కేటీఆర్ కొద్దిసేపు సరదాగా గడిపారు. ఏపీ నుంచి వచ్చిన సోదరుల ప్రేమతో పొంగిపోయా అని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర విభజన జరిగి రెండుగా విడిపోయినప్పటికీ తెలంగాణ, ఏపీ మధ్య వ్యక్తిగతంగా ప్రేమాభిమానాలు అలాగే ఉంటాయని ట్వీట్ చేశారు. బొత్స కుమారుడి వివాహం మాదాపూర్లోని హైటెక్స్లో జరిగింది. ఈ వేడుకకు ఏపీ సీఎం జగన్ దంపతులు, తెలంగాణ మంత్రి కేటీఆర్, ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తదితర ప్రముఖులు హాజరైన విషయం తెలిసిందే.