సమైక్య రాష్ట్రంలో ఒక్క బ్రిడ్జి నిర్మాణానికి 12ఏళ్ల సమయం పట్టిందని..ఇప్పుడు అక్కడే సమాంతరంగా నిర్మిస్తున్న రెండో బ్రిడ్జి నిర్మాణం పనులు కేవలం 12 నెలల్లో పూర్తి చేస్తున్నాం అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. అప్పనపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న రెండో బ్రిడ్జి పనులను సంబంధిత అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు.తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రతిష్టాత్మక నిర్మాణపనులు రికార్డుస్థాయిల్లో పూర్తవుతున్నాయన్నారు. వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి పనులు పూర్తి చేసి ఫిబ్రవరిలో బ్రిడ్జి ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించామని’ ఆయన వివరించారు. తెలంగాణకు ముందు కనీసం ఒక్క బ్రిడ్జి కూడా లేకపోవడంతో నిత్యం గంట గంటకోసారి రైల్వే గేటు పడడం వల్ల రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడేదని మంత్రి తెలిపారు.