Friday, April 26, 2024
Friday, April 26, 2024

తెలంగాణలో మళ్లీ ‘కంటి వెలుగు’

కంటి వెలుగు అమలుపై సమీక్ష నిర్వహించిన సీఎం
తెలంగాణ వ్యాప్తంగా మరోసారి కంటి వెలుగు కార్యక్రమం అమలు కాబోతోంది. జనవరి 18 నుంచి రెండో విడత అమలుచేయనున్నారు. ఈ కార్యక్రమం తొలి విడతకు ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. 2018 ఆగస్ట్‌ 15న మెదక్‌ జిల్లా మల్కాపూర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొలి విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదు నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమం కోసం అప్పట్లో ప్రభుత్వం రూ. 106 కోట్లను ఖర్చు చేసింది. కళ్లద్దాలతో పాటు మందులను కూడా పంపిణీ చేసింది.
ఇప్పుడు రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ కార్యక్రమం అమలుపై ఈరోజు అధికారులతో సమీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైద్యశాఖ మంత్రితో పాటు కొందరు ఇతర మంత్రులు కూడా హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img