టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గురువారం ఉదయం 10 గంటలకు శాసనమండలిలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి.. రాజేశ్వర్ రెడ్డి చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం చేకూర్చిన పట్టభద్రులకు, కృషిచేసిన కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.