రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పెద్దపల్లి ఎమ్మేల్యే దాసరి మనోహర్ రెడ్డి శుక్రవారం దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ను కోరారు. సికింద్రాబాద్ నుండి రామగుండం వైపు వెళ్తున్న జీఎం పెద్దపల్లి రైల్వే స్టేషన్లో కాసేపు ఆగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి జీఎంకు స్వాగతం పలికారు. పెద్దపల్లి, పొత్కపల్లి రైల్వే స్టేషన్లలో నెలకొన్న సమస్యలను జీఎంకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెద్దపల్లిలో హైదరాబాద్ టు నాగ్ పూర్, నవజీవన్ ఎక్స్ప్రెస్, దక్షన్, కేరళ వంటి రైళ్ళను ఆపాలని కోరారు.