ఉక్రెయిన్ నుంచి వస్తున్న విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్న్యూస్
ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థులు ఒక్కొక్కరుగా హైదరాబాద్ చేరుకుంటున్నారు. వారు శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాష్ట్రంలోని వారి స్వగ్రామానికి వెళ్ళడానికి తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. విమానాశ్రయం నుంచి నుంచి వారి స్వంత స్థలానికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులో ఉచితంగానే ప్రయాణించవచ్చని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. హైదరాబాద్ విమానాశ్రయంకు చేరుకున్న వారు ఎలాంటి టికెట్ తీసుకోకుండానే సొంతూరుకు ప్రయాణం చేయవచ్చని తెలిపింది. ఉక్రెయిన్ నుంచి ఢల్లీి, ముంబై నగరాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాల ద్వారా వారిని ఉచితంగా తీసుకొచ్చింది.అక్కడి నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ప్రయాణ ఏర్పాట్లు చేసింది. ఉక్రెయిన్ నుంచి తెలంగాణ విద్యార్థులంతా క్షేమంగా ఇళ్ళకు చేరుకునేంత వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉండనునున్నట్లు తెలంగాణ ఆర్టీసీ స్పష్టం చేసింది.