రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్ లో శీతాకాల విడిది చేయనున్నారు రాష్ట్రపతి. సోమవారం నుంచి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడిరచారు. సోమవారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు హకీంపేట నుంచి సోమాజిగూడ మార్గంలోని తిరుమలగిరి, కారానా, సికింద్రాబాద్ క్లబ్, టివోలీ, ప్లాజా, బేగంపేట, రాజ్భవన్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. మంగళవారం ఉదంయం 9 గంటల నుంచి 12 గంటల వరకు హకీంపేట, తిరుమలగిరి, కారా?నా, సికింద్రాబాద్ క్లబ్, టివోలీ ప్లాజా, సీఈఓ, ప్యారడైజ్, రాణీగంజ్, కర్బలా, ట్యాంక్బండ్, లిబర్టీ, హిమాయత్నగర్ వై జంక్షన్, నారాయణగూడ ఎక్స్ రోడ్డు, వైఎంసీఏ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు హకీంపేట- తిరుమలగిరి-కారానా-సికింద్రాబాద్ క్లబ్- టివోలీ ప్లాజా, సీటీఓ-బేగంపేట-ఎన్ఎఫ్సీఎల్-బంజారాహిల్స్ రోడ్నంబర్ 1/10 జంక్షన్, మాసాబ్ట్యాంక్, సరోజినీదేవి కంటి ఆస్పత్రి, పీవీ ఎక్స్ప్రెస్ హైవే ఆరాంఘర్, కాటేదాన్, మైలార్దేవ్పల్లి -బండ్లగూడ, చాంద్రాయణ గుట్ట, పిసల్బండ/చార్మినార్ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.