Friday, April 26, 2024
Friday, April 26, 2024

వీఆర్‌ఏలతో మంత్రి కేటీఆర్‌ భేటీ

ఆందోళన చేస్తున్న విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్లు( వీఆర్‌ఏ)లతో అసెంబ్లీలో సమావేశమయ్యారు మంత్రి కేటీఆర్‌. వీఆర్‌ఏల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని..వీఆర్‌ఏల డిమాండ్ల పైన ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో జాతీయ సమైక్యత వజ్రొత్సవ సంబరాలు జరుగుతున్న నేపథ్యంలో వీఆర్‌ఏలు తమ ఆందోళనలను విరమించి విధుల్లో జాయిన్‌ కావాలని కోరారు కేటీఆర్‌. 17వ తేదీన జాతీయ సమైక్యత వజ్రోతవ సంబరాలు ముగిసిన అనంతరం 18వ తేదీ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీఆర్‌ఏ ప్రతినిధులతో చర్చలు నిర్వహిస్తారని తెలిపారు.ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్‌ తమను పిలిచి తమ వాదన వినడం పట్ల వీఆర్‌ఏల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img