Friday, April 26, 2024
Friday, April 26, 2024

సాయమందించిన వారు దేశ ద్రోహులవుతారా? : కేటీఆర్‌

తెలంగాణ బీజేపీ నాయకుల వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు.సీఎం కేసీఆర్‌ ఖలీస్తాన్‌లకు(రైతులను ఉద్దేశించి) ఆర్థిక సాయం చేస్తున్న దేశ ద్రోహి అని బీజేపీ నాయకుడు చంద్రశేఖర్‌ అన్నారు. ఈ వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్‌ తప్పుబట్టారు.సంవత్సరం పాటు రైతుల ఆందోళనలను పట్టించుకోని వారు దేశభక్తులా? మృతి చెందిన రైతు కుటుంబాలకు సాయం చేయని వారు దేశభక్తులా..? రైతు కుటుంబాలకు సాయం అందించిన వారు దేశ ద్రోహులవుతారా? అని ప్రశ్నించారు. దేశభక్తిపై సర్టిఫికెట్‌ ఇవ్వడానికి ఈ మూర్ఖులు ఎవరని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img