ప్రస్తుతం సినిమా టికెట్ ధరల విషయమై తెలుగురాష్ట్రాల్లో తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిర్మాతల విజ్ఞప్తి మేరకు రేట్ల పెంపుపై ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. వాటిని పరిశీలించిన తెలంగాణ ప్రభుత్వం మూవీ టికెట్స్ పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఏసీ థియేటర్లలో కనిష్ఠ ధర రూ.50, గరిష్ఠ ధర రూ.150గా నిర్ణయించింది. మల్టీప్లెక్సుల్లో కనిష్ఠ ధర రూ.100, గరిష్ఠ ధర రూ.250గా నిర్ణయించింది. స్పెషల్ రిక్లైనర్ సీట్ల ధర రూ.300గా ఫిక్స్ చేశారు. సినిమా టికెట్ల రేట్లపై అదనంగా జీఎస్టీ ఛార్జీలు కూడా యాడ్ అవ్వనున్నాయి. ఏసీ థియేటర్లలో రూ.5, నాన్ ఏసీ థియేటర్లలో రూ.3గా అదనంగా జీఎస్టీ కూడా యాడ్ అవ్వనుంది. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే జీఎస్టీ ఛార్జీ పడుతుంది.