Friday, April 26, 2024
Friday, April 26, 2024

సీఎం కేసీఆర్‌ పాలనలో తెలంగాణ దూసుకుపోతోంది : ఎమ్మెల్సీ కవిత

ఇవాళ ప్రపంచం అంతా తెలంగాణను పెట్టుబడులకు, వ్యాపారాలకు తగిన కేంద్రంగా చూస్తోందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో తెలంగాణ దూసుకుపోతోందని, ఒక్కో సంవత్సరం గడిచేకొద్దీ సీఎం కేసీఆర్‌ ప్రజాసంక్షేమ పాలన విధానాలు తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజలను సామాజిక ఉన్నతికి చేర్చడంలో కీలకంగా మారుతున్నాయని కితాబిచ్చారు. రాష్ట్రంలో ఐటీ రంగం తిరుగులేని ప్రస్థానం కొనసాగిస్తోందని, స్టార్టప్‌ లకు అత్యంత అనువైన విధానాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ‘సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలు రాష్ట్రంలో 8.2 మిలియన్ల మందికి తోడ్పాటు అందిస్తున్నాయి. ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, కేసీఆర్‌ కిట్‌, క్షురకులు, రజకులకు ఉచిత విద్యుత్‌ వంటి పథకాలు ప్రజలకు చేయూతగా నిలుస్తున్నాయని అన్నారు. 2014-15లో రాష్ట్ర బడ్జెట్‌ రూ.1,00,637 కోట్లు ఉంటే ఇప్పుడు 2022-23లో అది రూ.2,56,958 కోట్లు అయింది. ఇదీ.. తెలంగాణ అభివృద్ధి గాథ, సీఎం కేసీఆర్‌ గారి దార్శనికత!’’ అంటూ కవిత సోషల్‌ మీడియాలో వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img