హైదరాబాద్ హయత్నగర్ సామూహిక అత్యాచారం కేసులో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. మూడు నెలలుగా బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డట్టు గుర్తించారు పోలీసులు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశారు. నిందితులు ఐదుగురూ మైనర్సే. వారిపై ఫోక్సో, జువైనల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఐతే స్కూల్లోనే పోర్న్ వీడియోలు చూడటం అలవాటు చేసుకున్నట్టు తెలుస్తోంది.ఆ వీడియోలు చూసి పుస్తకం కావాలంటూ ఆమె ఇంటికెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ విద్యార్ధి. ఆ వీడియోతో అతని స్నేహితులు బ్లాక్మెయిల్ చేస్తూ..పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారంటున్నారు పోలీసులు.ఐతే స్కూల్లో పోర్న్ వీడియోస్ చూశారనేది తప్పంటున్నారు స్కూల్ ప్రిన్సిపల్. తాము స్కూల్కు ఫోన్లను అనుమతించమని.. ప్రతిరోజూ చెక్ చేస్తామని ఆయన చెప్పారు. ఇది బయట జరిగిన విషయమని.. స్కూల్కి ఎటువంటి సంబంధం లేదన్నారు. మైనర్ నిందితులు సైతం అందరు విద్యార్థుల్లానే ఉండేవారని.. వారిపై ఎలాంటి అనుమానం కలగలేదని ఆయన చెప్పుకొచ్చారు. స్కూల్లో గంజాయి కొట్టిన సందర్భాలు కూడా లేవని.. బయట వారు ఎలా ఉండేవారో తమకు తెలియదన్నారు.