తెలంగాణ ఏర్పాటు తర్వాత అత్యవసర సమయంలో ఆస్పత్రులకు చేర్చే 108 అంబులెన్స్ సేవలను మరింత విస్తృతం చేసుకున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. వీటి సంఖ్యను 430కి పెంచుకున్నామని అన్నారు. వెంగళ్రావ్ నగర్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో రాష్ట్ర మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి అంబులెన్స్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ, ఈ రోజు రెండు అంబులెన్స్లు ప్రారంభించుకున్నాం. ఇందుకు సహకరించిన ఇండస్ ఇండ్ బ్యాంక్ వారికి కృతజ్ఞతలు. మరో 8 ఇవ్వడానికి ముందుకు వచ్చారు. సీఎస్ఆర్ కింద వీటిని సమకూర్చడం సంతోషకరమని పేర్కొన్నారు.