హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా గెలుపొందిన ఈటల రాజేందర్ ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం ఉదయం అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్లో హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్తో స్పీకర్ పోచారం శ్రీనివాస్ ప్రమాణాస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, తుల ఉమ, ఏనుగు రవీందర్ రెడ్డి, సహా పలువురు నేతలు హాజరయ్యారు.