హుజూరాబాద్ కాంగ్రెస్ నేత కౌశిక్రెడ్డి సోమవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా ప్రకటన అనంతరం కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ పెద్దలు తనకు సహకరించడం లేదని, పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా ఇతరులకు పదవులిస్తున్నారని అన్నారు. ‘‘50 కోట్ల రూపాయలు ఇచ్చి రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు. సీనియర్లను కాదని రేవంత్ రెడ్డికి టీపీసీసీ బాధ్యతలు అప్పగించడం నన్ను బాధించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మనుగడ కష్టం.’’ అన్నారు. కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, టీఆర్ఎస్ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్లు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో 24 గంటల్లో వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ సంఘం కౌశిక్రెడ్డికి ఇచ్చిన నోటీసులో పేర్కొంది. గతంలో కౌశిక్రెడ్డిని హెచ్చరించినా ఆయన తీరులో మార్పు రాలేదని క్రమశిక్షణ సంఘం తెలిపింది.