Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

కేసీఆర్‌ నోరు తెరిస్తే అబద్దాలే..: బండి సంజయ్‌

సీఎం కేసీఆర్‌ నోరు తెరిస్తే అబద్దాలేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. అబద్దాల కోసమే ప్లీనరీలు, బహిరంగ సభలు, మంత్రివర్గ సమావేశాలు పెడుతున్నారని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి మాట్లాడుతారని అంటే.. పెట్రోల్‌, డీజిల్‌ ధర తగ్గింపుపై ప్రకటన ఉంటుందని ఆశించామని.. అయితే తాను విమర్శలు చేశారని అన్నారు. రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి డిమాండ్‌ చేశారు. యువకులు ఉపాధి హామీ పని చేయడానికి గ్రామాలకు వస్తున్నారు. 62 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని ప్రభుత్వం చెప్తోంది.. దీనిపై సర్వే జరగాలని కోరారు ధాన్యం కొనుగోలుపై కేంద్రం పెత్తనం ఏంటని గతంలో కేసీఆర్‌ అన్నారు. ఇప్పుడు.. ఏడేండ్ల నుంచి కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తుందా? ధాన్యం కొనుగోలుకు లక్ష కోట్లు ఖర్చు పెట్టామని అంటారు. కేంద్రం ధాన్యం కొనట్లేదని మీరే అంటారు. దీనిపై సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాలన్నారు. 60 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొంటామని 31.08.2021 రోజున కేంద్రం లేఖ రాసింది. ఢల్లీికి వెళ్లి యుద్ధం చేస్తానన్నారు.. ఎక్కడ చేశారని ఎద్దేవ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం 32-35 శాతం వ్యాట్‌ పెంచారు. లీటర్‌ పెట్రోల్‌పై తెలంగాణకు రూ.28 వస్తున్నాయని.. కేంద్రానికి వచ్చే రూ.27లోను రాష్ట్రానికి రూ.12 వస్తున్నాయని వివరణ ఇచ్చారు. వ్యాట్‌ అత్యధికంగా విధించే రాష్ట్రాల్లో తెలంగాణ రెండోదన్నారు కేంద్రం తెలంగాణకు రూ.2,52,908 కోట్లు ఇచ్చింది.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ. 40 వేల కోట్లే వచ్చాయని అబద్దాలు చెప్తోందని దుయ్యబట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img