రాష్ట్రంలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 38 ఒమైక్రాన్ కేసుల నమోదు అయ్యాయి. ఒమైక్రాన్ కేసులలో తెలంగాణ నాల్గవ స్థానంలో నిలిచింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు విదేశీ రాకపోకలు ఎక్కువగా ఉండటమే వైరస్ వ్యాప్తికి కారణంగా తెలుస్తోంది.నిన్న ఒక్కరోజే 14 ఒమైక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు వైరస్ బాధితుల్లో 6 రిస్క్ దేశాల నుంచి, 31 మంది నాన్ రిస్క్ దేశాల నుంచి రాగా… మరొకరు కాంటాక్ట్ వ్యక్తి వైరస్ సోకింది. కేసులు ఎక్కువగా టోలిచౌకి, పారామౌంట్ నుంచే ఉన్నారు. ఒమిక్రాన్కు హైదరాబాద్ హాట్స్పాట్గా నిలుస్తోంది.అటు జిల్లాలోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది.