Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

జగ్గారెడ్డి వ్యాఖ్యలపై హైకమాండ్‌ తో చర్చించాం: మల్లు భట్టి విక్రమార్క

జగ్గారెడ్డి వ్యాఖ్యలపై హైకమాండ్‌ తో చర్చించాం: మల్లు భట్టి విక్రమార్కతమ పార్టీ అంతర్గత వ్యవహారాలపైనే కేసీ వేణుగాపాల్‌ తో చర్చించినట్టు తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సీనియర్‌ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చ జరగిందని చెప్పారు. ఇప్పుడు అంతా సర్దుకుందని అన్నారు. హైదరాబాద్‌ లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా… బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య ఉన్న దోస్తీ బయట పడిరదని చెప్పారు. బీజేపీ,టీఆర్‌ఎస్‌ లు ఒకరిపై మరొకరు విమర్శలు కూడా చేసుకోలేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో బీజేపీలోకి భారీ స్థాయిలో చేరికలు ఉంటాయని అన్నారు. దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img