Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

డోర్నకల్‌ అభివృద్ధికి మరింత కృషి చేస్తా : మంత్రి సత్యవతి రాథోడ్‌

డోర్నకల్‌లోని సీఎస్‌ఐ చర్చిలో జరిగిన 38వ ఆలోచన మహా సభల్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ పాల్గొని ప్రసంగించారు. 38వ ఆలోచన మహా సభలు ఇక్కడ ఇంత ఘనంగా చేసుకోవడం సంతోషకరమన్నారు. డోర్నకల్‌ ప్రజలు తనను వారి బిడ్డగా భావించి ఎప్పుడూ ఆదరించారన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి తన బాధ్యత అని చెప్పారు. అన్ని మతాలు, కులాల్ని గౌరవించే గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్‌ అన్నారు. అందుకే క్రిస్మస్‌ సందర్భంగా విందులు ఏర్పాటు చేసి, దుస్తులు పంపిణీ చేసే గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నారన్నారు. త్వరలో ఇక్కడ జూనియర్‌ కాలేజీ రానుందన్నారు. డోర్నకల్‌ అభివృద్ధికి మరింత కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రి వెంట జెడ్పీటీసీ బండి వెంకట్‌ రెడ్డి, టీ.ఆర్‌.ఎస్‌ నేతలు కొంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, కాలం రవీందర్‌ రెడ్డి, సురేష్‌ ప్యాట్ని, మోయిన్‌ పాషా, తాళ్లూరి హనుమ, ఇతర నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img