కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కొనసాగుతోంది. మోదీ సర్కార్ తీవ్రతరం చేసిన కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా కార్మిక, ఉద్యోగ, ప్రజా, వామపక్ష సంఘాలు కదంతొక్కాయి. నేడు, రేపు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా తెలంగాణలో వివిధ కార్మిక, ప్రజా సంఘాలు పలుచోట్ల ర్యాలీలు నిర్వహించారు. మరోవైపు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో బొగ్గు గనుల ఆవరణలు అన్నీ బోసిపోయి కనిపించాయి.