: సీఎస్ సోమేశ్ కుమార్
కరోనా థర్డ్వేవ్ వస్తే ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ చెప్పారు. జీహెచ్ఎంసీలో కరోనా ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైన్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఖైరతాబాద్ ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్లో వ్యాక్సినేషన్ను ఆయన పరిశీలించారు. జీహెచ్ఎంసీలోని ప్రతి కాలనీకి సంబంధించిన షెడ్యూల్ తయారు చేశామని తెలిపారు.కాలనీల్లో టీకా తీసుకోని వారి గుర్తిస్తున్నామని తెలిపారు. 15 రోజుల్లో ప్రతి వ్యక్తికి ఒక డోసు టీకా పూర్తిచేస్తామన్నారు. నగరంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ పూర్తయిన తర్వాత రాష్ట్రమంతటా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడతమన్నారు.