Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

దళితబంధు పథకం లబ్దిదారులకు యూనిట్ల పంపిణీ

వాసాలమర్రి దళితులు సీఎం కేసీఆర్‌ నమ్మకాన్ని నిలబెట్టాలని, ఆర్థికంగా విజయం సాధించి దేశానికే ఆదర్శంగా నిలవాలని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. వాసాలమర్రిలో మంత్రి జగదీశ్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత కలిసి దళితబంధు పథకం లబ్దిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇవాళ తెలంగాణ సంక్షేమ పథకాల గురించి దేశమంతా మాట్లాడుకుంటున్నారని అన్నారు. దళితబందు పథకం ప్రపంచానికే గొప్ప దారి చూపే పథకం అని అన్నారు. అనంతరం ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత మాట్లాడుతూ.. వాసాలమర్రి గ్రామం చరిత్రలో నిలిచిపోయిందన్నారు.రూపాయి కూడా వృధా చేయకుండా ఆర్ధికంగా బలోపేతం కావాలన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా వాసాలమర్రి దళితులు సమగ్రాభివృద్ధి సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ పమేలా సత్పతి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శ్యాంసుందర్‌, గ్రామ సర్పంచ్‌ ఆంజనేయులు, ఎంపీటీసీ నవీన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img