ధాన్యం కొనగోళ్లపై కేంద్ర వైఖరికి నిరసనగా నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 12న ధర్నాకు టీఆర్ఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఆ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో.. ధర్నాలకు ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి అనుమతి తీసుకోవాలని పార్టీ నేతలకు సూచించారు.