పార్టీలో ఉన్నవారిని కేసీఆర్ కోవర్టులుగా మార్చుకుని రాజకీయ లబ్ది పొందుతున్నందున అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నట్లుగా తెలుస్తోంది. కూర్చున్న కొమ్మను నరుక్కోవద్దని, అందరూ కష్టపడి పార్టీకోసం పనిచేద్దామని చెప్పారు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడని, పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా కఠిన చర్యలు తప్పవని అన్నారు.