Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

బ్రిటన్‌ రాణి మృతికి గౌరవ సూచకంగా రేపు సంతాపదినం

తెలంగాణ ప్రభుత్వం బ్రిటీష్‌ క్వీన్‌ ఎలిజబెత్‌2 గౌరవార్థం ఒకరోజు సంతాప దినాన్ని పాటించాలని నిర్ణయించింది. ఈ మేరకు సెప్టెంబర్‌ 11న సంతాప దినంగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. క్వీన్‌ ఎలిజబెత్‌2 మృతి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు సంతాప దినాలను పాటిస్తున్నాయి. కాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రేపు సంతాప దినాన్ని పాటించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలను జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని సగం వరకు కిందకు దించాలని ఆదేశించారు. రేపు అధికారికంగా ఎలాంటి వేడుకలను నిర్వహించకూడదని ఆదేశాలను జారీ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img