Monday, May 6, 2024
Monday, May 6, 2024

మునుగోడు ఓటర్ల జాబితా ప్రకటనపై హైకోర్టులో విచారణ వాయిదా

మునుగోడు ఉప ఎన్నికల ఓటర్ల జాబితా పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడిరది. ఓటర్ల జాబితా నివేదికను సమర్పించాలని ఈసీకి హైకోర్టు ఆదేస్తూ విచారణను రేపటి(శుక్రవారం)కి వాయిదా వేసింది. గురువారం ఓటర్ల జాబితా పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్‌ తరపున న్యాయవాది రచనా రెడ్డి వాదనలు వినిపించారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ల నమోదు జరిగిందని, ఫార్మ్‌ 6 ప్రకారం కొత్తగా దాదాపు 25 వేల ఓట్లు నమోదు చేసుకున్నారని కోర్టుకు తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలోని వివిధ మండలాలలో భారీగా ఓటర్ల నమోదు ప్రక్రియ జరిగిందని పేర్కొన్నారు. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ ఖరారు అయ్యిందని… నవంబర్‌ 3 న ఉప ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఉపఎన్నికల నేపథ్యంలో భారీగా ఓటర్ల నమోదు అక్రమంగా జరిగిందని రచనా రెడ్డి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img