Monday, May 6, 2024
Monday, May 6, 2024

వరద ముంపునకు గురికాకుండా శాశ్వత పరిష్కారానికి కృషి : మంత్రి తలసాని

మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా రోడ్లు, సీవరేజ్‌, ఫ్లై ఓవర్ల నిర్మాణం, అభివృద్ధి పనులు చేపడుతామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. శుక్రవారం ముషీరాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని నాగమయ కుంట అభివృద్ధి పనులను మంత్రి మహమూద్‌ అలీతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ, ప్రతి ఏటా వర్షాకాలంలో కాలనీలు ముంపునకు గురవుతూ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img