Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ దొడ్డిదారిన సీఎం అయ్యారు

: మంత్రి హరీష్‌రావు

మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ దొడ్డిదారిన సీఎం అయ్యారని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఏ రంగంలో కూడా మధ్యప్రదేశ్‌ తెలంగాణకు పోటీ కాదన్నారు. గొప్పగా పాలిస్తే తెలంగాణలో మధ్యప్రదేశ్‌ కూలీలు ఎందుకుంటారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఏటీఎంతో పోల్చడం సరికాదని తెలిపారు. ఎలాంటి అవినీతి జరగలేదని పార్లమెంట్‌లో మహారాష్ట్ర ప్రభుత్వమే స్పష్టం చేసిందని చెప్పారు. ఉద్యోగాల భర్తీ చేయొద్దనే 317 జీవో రద్దు చేయాలంటున్నారని అన్నారు. ఉద్యోగులకు కేంద్రం 15శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే… తెలంగాణ ప్రభుత్వం 73 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిందన్నారు. తెలంగాణలో 2.2 శాతం మాత్రమే నిరుద్యోగ రేటు ఉందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img