యూపీలో లఖింపూర్ ఖేరీ ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను అరెస్టు చేయాలని, ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా రైతులు రైల్ రోకో నిర్వహిస్తున్నారు. లఖింపూర్ ఘటనకు కారణమైన ఆయన కుమారుడు ఆశిష్ మిశ్రా అరెస్టు అయ్యారు. అయితే కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా అరెస్టుతో పాటు ఆయన రాజీనామాను కోరతూ ఆరు గంటల పాటు రైల్ రోకో ఆందోళనకు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుచ్చింది.. హర్యానాలోని బహదూర్ఘర్ వద్ద రైతులు పట్టాలపై కూర్చుని రైతులు ఆందోళన నిర్వహించారు.