Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

ఘనంగా జరిగిన బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 25వ వార్షికోత్సవ వేడుకలు

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని శివానగర్లో గల బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 25 వ వార్షికోత్సవ వేడుకలు కరెస్పాండెంట్ సీవీ శేషు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎంఈఓ గోపాల్ నాయక్, జబర్దస్తీ నెమలి రాజు పాల్గొని సంబరాల్లో ఒక కొత్త ఊపును అందించారు. ఈ సిల్వర్ జూబ్లీ కార్యక్రమం వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య నడిచిన వైనం అందరిని ఆకట్టుకుంది. 5000 మంది తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు పాల్గొని కనులు విందుగా వేడుకలను వీక్షించారు. పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు నిర్వహించిన 35 డాన్స్ ప్రోగ్రాం అందరినీ ఆకట్టుకుంది. పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి ముఖ్య అతిధుల చేతుల మీదుగా మెమో అందజేశారు. తదుపరి ప్రస్తుత 500 మంది విద్యార్థులకు, పూర్వ విద్యార్థులు 500 మందికి గోల్డ్ మెడల్స్ అండ్ సిల్వర్ మెడల్స్ ను సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం ముఖ్య అతిథులు, కరెస్పాండెంట్ సిబి శేషు మాట్లాడుతూ చదువు అనేది లక్ష్యంతో ముందుకు వెళ్ళినప్పుడే భవిష్యత్తులో బంగారు బాట వేసే అవకాశం ఉందని తెలిపారు. ఇష్టపడి కష్టపడి చదివినప్పుడే అనుకున్న లక్ష్యంతో ముందుకు విద్యార్థులు వెళ్లాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఉన్నత స్థాయి కు చేర్చేందుకు అహర్నిశలు కృషి చేయాలని, విద్యార్థులు కూడా తల్లిదండ్రులు పడుతున్నటువంటి కష్టాలను గుర్తిరిగి, చదువులో మంచి సాధన చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు పూర్వ విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img