Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

అమృత సరోవర్ కొనేరులను పరిశీలన చేసిన స్పెషల్ టీమ్

విశాలాంధ్ర-సీతానగరం: మండలంలోని అప్పయ్యపేట, కోటసీతారాంపురం, జానుమల్లువలస గ్రామాల్లోని ఉపాధి హామీ పథకం నిధులతో అభివృద్థి పనులను చేపట్టి సుందరంగా తీర్చిదిద్దిన అమృత సరోవర్ కొనేరులని శుక్రవారం అమృత సరోవర్ స్పెషల్ ఆఫీసర్ డి.మళ్ళిఖార్జునరావు, మన్యం జిల్లా డ్వామా పిడి రామచంద్రరావులు శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు.వారికి ఆయా గ్రామాలకు చెందిన వేతనదారులు, ప్రజాప్రతినిధులు ఘణస్వాగతం పలికారు.గ్రామాల్లోని కోనేరులని సుందరీకరణ చేసిన పనుల పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు.స్తానిక ప్రజా ప్రతినిధులు, వేతనదారులు కూడా కొనేరులన అభివృధ్ధికి నిధులు మంజూరు చేసి సుందరీకరణ చేయడంతో వారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో ఎంపిడిఓ ప్రసాద్, ఉపాధి హామీ ఏపిఓ భాను, జేఈ కృష్ణారావు,సర్పంచులు జొన్నాడ తేరేజమ్మగరికయ్య, ఉడమల కృష్ణమూర్తి,యాళ్ల వెంకటనాయుడు, ఎంపిటిసి బురిడి కుసుమ కుమారి సూర్యనారాయణ, సెక్రెటరీలు వెంకటరావు, కామేశ్వర రావు, శంకరరావు, టీఏలు జానకి, లక్ష్మణలతో పాటు ఆయా సచివాలయంల సిబ్బంది, గ్రామ పెద్దలు, ఉపాధి హామీ పథకం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img